నల్లమలలో ట్రాఫిక్ జామ్
ABN, First Publish Date - 2022-05-19T05:15:52+05:30
నల్లమలలోని రోళ్లపెంట ఘాట్ వద్ద కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై బుధవారం ట్రాఫిక్ ఆగిపోయింది.
ఆత్మకూరు, మే 18: నల్లమలలోని రోళ్లపెంట ఘాట్ వద్ద కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై బుధవారం ట్రాఫిక్ ఆగిపోయింది. గత ఏప్రిల్ 30వ తేదీ రోళ్లపెంట ఘాట్లో ఓ మినీ లారీ అదుపుతప్పి లోయలో పడింది. దాన్ని బయటకు తీసేందుకు బుధవారం రోళ్లపెంట ఘాట్ వద్దకు భారీ క్రేన్లు చేరుకున్నాయి. ఈ క్రమంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు వేగంగా మినీలారీకి బయటికి తీసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.
Updated Date - 2022-05-19T05:15:52+05:30 IST