సురేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలి
ABN, First Publish Date - 2022-08-11T05:24:29+05:30
నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గౌరు వెంకటరెడ్డి
నందికొట్కూరు రూరల్, ఆగస్టు 10 : నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నందికొట్కూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గౌరు వెంకటరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న గూడూరు సురేంద్ర కుమార్ అనే పోలీసు దుండగుల చేతిలో అతి కిరాతకంగా హత్యకు గురయ్యారని అన్నారు. ఈ సంఘటన ప్రజల్లో భయాందోళన కల్గిస్తుంన్నదని అన్నారు. దుండగుల చేతిలో హత్యకు గురైన సురేంద్ర కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలన్నారు. తాను ముఖ్యమంత్రి అయితే మద్యాన్ని దశల వారిగా నిషేధిస్తానని హామీ ఇచ్చిన జగన్ మూడు సంవత్సరాలు అయినా మద్య నిషేధం గురించి పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు షకీల్అహ్మద్, రాష్ట్ర లీగల్సెల్ నాయకులు జాకీర్, ఐటీడీపీ నియోజకరవర్గ నాయకులు ముర్తుజావళి, టీడీపీ కౌన్సిలర్ భాస్కరెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-11T05:24:29+05:30 IST