ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల సేవలు పెరగాలి

ABN, First Publish Date - 2022-08-09T06:16:14+05:30

గ్రామ వార్డు సచివాలయాల నుంచి ప్రజలకు సేవలు పెరగాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌కు సమస్యలు విన్నవిస్తున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు(కలెక్టరేట్‌) ఆగస్టు 8: గ్రామ వార్డు సచివాలయాల నుంచి ప్రజలకు సేవలు పెరగాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.  జిల్లాలో తొమ్మిది సచివాలయాల్లో ఒక్క సేవ కూడా అందకపోవడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 14 మండలాకు సంబంధించి 24 సచివాలయాల్లో ఒక్క సర్వీస్‌ మాత్రమే అందించారని తెలిపారు. ప్రజలకు సేవలందించే విషయమై సచివాలయ ఉద్యోగులకు సెప్టెంబరు నుంచి వర్క్‌షాపులు ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. మండల స్పెషల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీ డీవోలతో కూడా ఈ అంశంపై సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే స్పందన అర్జీలు రీఓపెన్‌ కాకూడదని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T06:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising