బస్సు కింద పడి వృద్ధురాలి మృతి
ABN, First Publish Date - 2022-12-03T00:35:46+05:30
ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి వృద్దురాలు మృతి చెందిన ఘటన పత్తికొండ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది.
పత్తికొండ, డిసెంబరు 2: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి వృద్దురాలు మృతి చెందిన ఘటన పత్తికొండ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ మురళీమోహన్ తెలిపిన వివరాలివీ.. మండలంలోని పుచ్చకాయలమాడ గ్రామానికి చెందిన మునెమ్మ అలియాస్ బంటమ్మ (65) అనే వృద్ధురాలు నిత్యం పత్తికొండకు వచ్చి హోటళ్లు, దుకాణాల్లో చిన్నచిన్న పనులు చేసేవారు. ఈ క్రమంలో శుక్రవారం వెంకటేశ్వర టాకీస్ వద్ద ఓ హోటల్లో పనిచేసేందుకు వచ్చారు. దోసె తింటూ కళ్లు తిరిగి రోడ్డుపై పండిది. అదే సమయంలో పత్తికొండ నుంచి మంత్రాలయం వైపు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు ఆమె తలపై నుంచి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేసేలోగా వృద్దురాలి తల ముక్కలై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ మురళీమోహన్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవి ఘటన గురించి తెలసుకున్నారు.
Updated Date - 2022-12-03T00:35:48+05:30 IST