బయలు వీరభద్ర స్వామికి పూజలు
ABN, First Publish Date - 2022-11-23T23:50:19+05:30
శ్రీశైల క్షేత్రంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని క్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేషార్చనలు నిర్వహించారు.
శ్రీశైలం, నవంబరు 23: శ్రీశైల క్షేత్రంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని క్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేషార్చనలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా మహాగణపతికి పూజలు చేశారు. ఈ పరోక్షసేవలో ఆలయ ఈవో ఎస్. లవన్న పాల్గొన్నారు. భక్తులు ఈ పరోక్షసేవలో పాల్గొనేందుకు దేవస్థానం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం.ఒఆర్జీద్వారా ఒక్కొక్కపూజకు రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి పాల్గొనవచ్చునని ఈవో తెలిపారు. సాక్షిగణపతికి, ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా సాయంత్రం విశాఖపట్నానికి చెందిన టి.శైలజ నృత్య ప్రదర్శన అలరించింది.
Updated Date - 2022-11-23T23:50:22+05:30 IST