వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-05-19T05:48:38+05:30
మండలంలోని చందలూరు గ్రామానికి చెందిన బోయ ఎమ్మనూరు నాగరాజు (33) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రుద్రవరం, మే 18: మండలంలోని చందలూరు గ్రామానికి చెందిన బోయ ఎమ్మనూరు నాగరాజు (33) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండేళ్ల నుంచి కడుపునొప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. వ్యాధి తీవ్రత భరించలేక జీవితంపై విరక్తి చెంది విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య నాగలక్ష్మి తెలిపింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నిరంజన్రెడ్డి తెలిపారు.
Updated Date - 2022-05-19T05:48:38+05:30 IST