ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేత్ర పర్వంగా నవరాత్రి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-10-01T05:55:09+05:30

నగరంలో దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి.

హుశేనాపురంలో అమ్మవారికి పూజలు చేస్తున్న గౌరు వెంకటరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(కల్చరల్‌), సెప్టెంబరు 30: నగరంలో దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజు శుక్రవారం అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, అష్టోత్తర శతనా మావళి పారాయణం, కుంకుమార్చనలు, మహా మంగళహారతి నిర్వహించారు. సాయంత్రం విశేష అలంకరణలతో భక్తులకు దర్శనం కల్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజున శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. నగరంలోని వివిధ ఆలయాల్లో శుక్రవారం సాయంత్రం మహిళా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆయా అలయాల కమిటీల ప్రతినిధులు క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. నగరంలోని మించిన్‌ బజార్‌లో గల పెద్ద అమ్మవారిశాలలో శుక్రవారం ప్రత్యేక పూజలు, సాయంత్రం అమ్మవారికి ధనలక్ష్మీదేవి అలంకరణ చేశారు. పూల బజార్‌లోని చిన్న అమ్మవారిశాలలో అమ్మవారికి ధనలక్ష్మీదేవి అలంకరణ, వన్‌టౌన్‌లోని గీతామందిర్‌లో గజలక్ష్మీదేవి అలంకరణ, కాళికాంబ దేవాలయంలో లలితాదేవి అలంకరణలతో భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తారి వీధిలోని నిమిషాంబాదేవీ ఆలయంలో అమ్మవారికి లలితా త్రిపురసుందరి దేవి అలంకరణ, సప్తగిరి నగర్‌ అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంగణంలోని చౌడేశ్వరి దేవి మాత ఆలయంలో అమ్మవారికి లలితాదేవి అలంకరణ చేశారు. 

ఓర్వకల్లు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఐదో రోజు మండలంలోని వివిధ గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు పూజలు నిర్వహిం చారు. హుశేనాపురం గ్రామంలో దుర్గాదేవి విగ్రహానికి టీడీపీ నంద్యాల పార్ల మెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి పూజలు నిర్వహించారు. అలాగే ఓర్వకల్లులోని చౌడేశ్వరిదేవి, సుంకులమ్మ ఆలయాల్లో అమ్మవారికి, నన్నూరులో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహ బూబ్‌బాషా, సుధాకర్‌, రామగోవిందు, నాగరాజు, నారాయణ పాల్గొన్నారు.

గూడూరు:
దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  మండలంలోని కె నాగ లాపురం గ్రామంలోని సుంకులాపరమేశ్వరి అమ్మవారు శ్రీమహా లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం ఆలయంలో గణపతి పూజ, హోమాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహ ణాధికారి దినే ష్‌, ఆలయ సిబ్బంది కేశవ, పురోహితులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.



Updated Date - 2022-10-01T05:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising