చంద్రబాబు పర్యటనతో వైసీపీలో వణుకు
ABN, First Publish Date - 2022-05-22T06:09:13+05:30
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూఖ్, టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు.
నంద్యాట టౌన్, మే 21: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూఖ్, టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన విజయవంతమైన సందర్భంగా నంద్యాలలోని రాజ్ థియేటర్ ఆవరణలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ అధికారంలోనికి వచ్చిన వైఎస్ జగన్ పాలనను చూసి జనం విసుగు చెందారన్నారు. చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను అంటూ అన్నింటి మీద డబ్బులు వసూలు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఇది చూసి వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. వైసీపీ బాదుడే బాదుడుతో జనం విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-22T06:09:13+05:30 IST