ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ.33.48 లక్షలు

ABN, First Publish Date - 2022-08-11T05:25:42+05:30

మహానంది క్షేత్రంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 33.48 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, ఆగస్టు 10: మహానంది క్షేత్రంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 33.48 లక్షల  ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆలయం ప్రాంగణంలోని అభిషేకమంటపంలో  ప్రధాన ఆలయాల్లోని హుండీలతో పాటు అన్నప్రసాదం, గో సంరక్షణ హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. ప్రధాన ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.32,44,655, అన్నదానం రూ.78,061, గోసంరక్షణ హుండీ ద్వారా రూ. 26,141 ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గడివేముల గ్రూపు దేవాలయాల ఈవో నాగప్రసాద్‌, ఏఈఓ ఎర్రమల్ల మధుతో పాటు పాలకమండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున, వీరభద్రుడు, 90 మంది దత్తసాయి సేవకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising