యువత సమస్యలపై లోకేష్ శంఖారావం
ABN, First Publish Date - 2022-12-31T00:59:03+05:30
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకు ండా చేశారని, అందువల్ల నారా లోకేశ్ యువ తరం సమస్యలపై పోరాడేందుకు టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27న రాష్ట్రంలోని కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభిస్తున్నారని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
అప్పుడే వైసీపీలో మొదలైన వణుకు
సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 30: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకు ండా చేశారని, అందువల్ల నారా లోకేశ్ యువ తరం సమస్యలపై పోరాడేందుకు టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27న రాష్ట్రంలోని కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభిస్తున్నారని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు యువత కోసం వివి ధ దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చారని అన్నారు. అయితే వైఎస్ జగన్ పాలనలో యువత రోజుకో కష్టాన్ని అనుభవిస్తున్నదని ఆరోపించారు. ఉన్న పరిశ్రమలు కూడా బయటి రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు. లోకేష్ పాదయాత్రను పూర్తి స్థా యిలో విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు.
Updated Date - 2022-12-31T00:59:07+05:30 IST