మహానాడును విజయవంతం చేద్దాం
ABN, First Publish Date - 2022-05-23T06:21:52+05:30
ఒంగోలులో ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
ఆత్మకూరు, మే 22: ఒంగోలులో ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఆత్మకూరు మండల క్షేత్ర స్థాయి కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ఒంగోల్ నగరంలో జరిగే మహానాడుకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశంలో శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ తిరుపమయ్య, టీడీపీ మైనార్టీ విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సి.కలీముల్లా, టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు శివప్రసాద్రెడ్డి, వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లాపురం బాషా, ఫకృద్దీన్ తదితరులు ఉన్నారు.
నేడు మహానాడు సన్నాహక సమావేశం
ఆత్మకూరు పట్టణంలోని శ్రీవెంకటేశ్వర కల్యాణ మంటపంలో సోమవారం టీడీపీ మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు సుధాకరరెడ్డి రానున్నట్లు తెలిపారు.
టీడీపీ నాయకుడి కుటుంబానికి పరామర్శ
ఆత్మకూరు పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు రజాక్ మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పరామర్శించారు. రజాక్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ప్రగాఽఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Updated Date - 2022-05-23T06:21:52+05:30 IST