నిజాయితీకి నిలువుటద్దం
ABN, First Publish Date - 2022-08-17T05:39:30+05:30
నీతి నిజా యితీలకు నిలువుటద్దంగా దివంగత నేత కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గుర్తింపు పొందారని, ఆయన ఉమ్మడి రాష్ట్రా నికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.
- ఘనంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి
- కిసాన ఘాట్ వద్ద కోట్లకు టీడీపీ నేతల నివాళి
కర్నూలు(అగ్రికల్చర్), ఆగస్టు 16: నీతి నిజా యితీలకు నిలువుటద్దంగా దివంగత నేత కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గుర్తింపు పొందారని, ఆయన ఉమ్మడి రాష్ట్రా నికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 102వ జయంతి సందర్భంగా కిసానఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్ర దేశకు ముఖ్యమంత్రిగా పని చేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి పదవులకే వన్నె తెచ్చారని, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకమన్నారు. కార్యక్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటే శ్వర్లు, రాంపుల్లయ్య యాదవ్, ఆకేపోగు ప్రభాకర్, మాజీ జడ్పీ చైర్మన ఆకెపోగు వెంకటస్వామి, నరసింహులు యాదవ్, గోపినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-17T05:39:30+05:30 IST