Kurnool ప్రభుత్వాస్పత్రిలో మరోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం
ABN, First Publish Date - 2022-06-22T13:03:21+05:30
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
కర్నూలు: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి పలు ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటలకే వార్డుల్లో అంధకారం ఏర్పడింది. బూత్ బంగ్లా ఈఎన్టి విభాగంలో దాదాపు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దోమలు, ఉక్కపోతతో రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని రోగులు కోరుతున్నారు.
Updated Date - 2022-06-22T13:03:21+05:30 IST