Kurnool: రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందడి
ABN, First Publish Date - 2022-01-13T17:52:26+05:30
జిల్లాలోని నంద్యాలలో సంజీవ నగర్ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు.
కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో సంజీవ నగర్ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు. సంజీవనగర్ రామాలయంలో వెంకటేశ్వర స్వామి వారిని కన్యాకుమారి నుండి తెప్పించిన గవ్వలు, శంఖులతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగుతోంది.
Updated Date - 2022-01-13T17:52:26+05:30 IST