ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కర్నూలు జిల్లా, ఆదోనిలో వైసీపీ నేతలకు నిరసన సెగ

ABN, First Publish Date - 2022-08-09T16:06:20+05:30

ఆదోనిలో వైసీపీ (YCP) నేతలకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు కార్యక్రమంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (Kurnool) జిల్లా: ఆదోనిలో వైసీపీ (YCP) నేతలకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని, మాజీ ఎంపీ బుట్టా రేణుకను ప్రజలు అడ్డుకున్నారు. అర్హులైన వారికి అమ్మఒడి నిధులు పడలేదని రేణుకను మహిళలు నిలదీశారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదోనిలో రోడ్లు, డ్రైనేజ్‌లు సరిగా లేవని ఎమ్మెల్యేను పలువురు కాలనీ వాసులు నిలదీశారు. వర్షం వస్తే రోడ్లు కాలవను తలపిస్తున్నాయని ఎరుకల కాలనీ వాసులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గడప గడప కార్యక్రమంలో ప్రజలు నిలదీయడంతో వైసీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అన్ని పనులు పూర్తి చేయిస్తానని చెబుతూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. 

Updated Date - 2022-08-09T16:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising