ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోటల్‌కు నిప్పు

ABN, First Publish Date - 2022-01-03T05:39:20+05:30

మండలంలోని మదనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామోహ్మన్‌ బస్టాండ్‌ వద్ద హోటల్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, జనవరి 2: మండలంలోని మదనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామోహ్మన్‌ బస్టాండ్‌ వద్ద హోటల్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పు పెట్టడంతో హోటల్‌తో పాటు సామాగ్రి అంతా కాలిబూడిదైంది. దాదాపు రూ. 80వేలు నష్టం వాటిల్లింది. జోన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రామాంజనేయుల కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


‘మంచి పద్ధతి కాదు’


రామ్మోహన్‌ హోటల్‌కు పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టడం దారుణమని,  ఇది మంచి పద్ధతి కాదని మాజీ జడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి, టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి ధనుంజయుడు అన్నారు. ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడ్ని పరామర్శించారు. నాయకులు మాట్లాడుతూ పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ హయాంలో ఈ లాంటివి ఎప్పుడు జరగలేదన్నారు. మాజీ సర్పంచ్‌ వెంటకవర్మ, మదనంతపురం టీడీపీ నాయకులు ప్రసాద్‌, సంజప్ప, శ్రీనివాసులు, హరినాథ్‌గౌడ్‌, శ్రీరాములు, సీపీఐ నాయకులు పాపన్న, హనుమన్న, పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-03T05:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising