ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు జాతర

ABN, First Publish Date - 2022-01-21T04:42:00+05:30

ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఏడాది జరిగే నీలకంఠేశ్వరస్వామి జాతరలో ఎద్దుల విక్రయం జరగడం ఆనవాయితీ. అట్లాగే వ్యవసాయంలో ఉపయోగించే పలుగు, పార, నాగలి, గొర్రు, దంతెలు, కాడిమాన్లులు కూడా విక్రయిస్తారు.

విక్రయానికి తరలించిన ఎద్దులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మకానికి  ఎద్దులు, వ్యవసాయ పనిముట్లు

ఎమ్మిగనూరు, జనవరి20: ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఏడాది జరిగే నీలకంఠేశ్వరస్వామి జాతరలో ఎద్దుల విక్రయం జరగడం ఆనవాయితీ. అట్లాగే వ్యవసాయంలో ఉపయోగించే పలుగు, పార, నాగలి, గొర్రు, దంతెలు, కాడిమాన్లులు కూడా విక్రయిస్తారు. దీంతో ఈ జాతరకు రైతు జాతరగా గుర్తింపు ఉంది. పట్టణ శివారులోని మంత్రాలయం రోడ్డు సమీపంలో ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో ఎద్దులు, కోడెలు, దూడలను పశువుల యజమానులు, రైతులు రెండురోజుల ముందే తరలించారు. గురువారం వాటిని చూసేందుకు, కొనుగోలు చేసేందుకు  రైతులు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంత జనసందోహంగా కనిపించింది. జత ఎద్దులు రూ. లక్షల్లో పలకటం విశేషం. నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన కోడెలు ఆకర్షణీయంగా నిలిచాయి. అలాగే కోసిగి మండలం చిన్నభూంపల్లికి చెందిన జత ఎద్దులకు రూ. 1.26 లక్షలకు కర్ణాటక రైతులు కొన్నారు. మంత్రాలయం మండలం చిలకడోన గ్రామానికి చెందిన జత ఎద్దులు రూ. 2లక్షలు ధర పలికాయి. అలాగే నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన కోడెలు రూ. 2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పైగా పలుకుతున్నాయి.

Updated Date - 2022-01-21T04:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising