ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఉగ్రవాదపార్టీ... ఏపీని తాలిబన్లుగా పాలిస్తున్నారు: Vishnuvardhan

ABN, First Publish Date - 2022-01-11T18:26:19+05:30

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: వైసీపీ ప్రభుత్వంపై  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.  వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చారన్నారు. ఆంధ్రాను తాలిబాన్లుగా పాలిస్తున్నారని... వైసీపీ ఉగ్రవాదపార్టీ అని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎంల రూపంలో పాలిస్తున్నారని.... ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటన్నారు. ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదన్నారు. వైసీపీ, బీజేపీ మధ్య జరిగిన సంఘటన అని తెలిపారు. వైసీపీ నేతలను కేసు నుంచి తప్పించేందుకు మత ఘర్షణలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్డీఎఫ్ రూపంలో ఉగ్రవాదమూకలు పని చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మధ్య జరిగిన చర్చలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ కేంద్ర ఆఫీస్ సూచనాలతోనే ఆత్మకూరులో దాడులు చేశారన్నారు. ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్నవాళ్ళు డిప్యూటీ సీఎంను ఎందుకు పంపారని ప్రశ్నించారు. ఐపీసీని వైసీపీగా మార్చేస్తారా అని నిలదీశారు. ఆత్మకూరు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పులులు ఢిల్లీలో పిల్లులు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-01-11T18:26:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising