భక్తులకు అరటాకు భోజనం
ABN, First Publish Date - 2022-10-07T05:56:28+05:30
మహానంది క్షేత్రంలో ఇక నుంచి భక్తులకు అరిటాకుతో భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
మహానంది, అక్టోబరు 6: మహానంది క్షేత్రంలో ఇక నుంచి భక్తులకు అరిటాకుతో భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. దసరా పర్వదినం పురస్కరించుకొని మహానంది క్షేత్రంలోని నిత్యాన్నదానసత్రంలో దాతల సహకారంతో నిర్మించిన స్టీల్ బెంచిలపై భక్తులకు అరిటాకు భోజనం కార్యక్రమాన్ని ఈవోతో పాటు పాలకమండలి చైర్మన్ కొమ్మా మహేశ్వరరెడ్డి ప్రారంభించారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన భక్తశేషారెడ్డి ప్రతిరోజు నిత్యాన్నదాన సత్రానికి ఉచితంగా అరిటాకులు సరఫరా చేస్తారు. పాలకమండలి సభ్యుడు గంగిశెట్టి మల్లికార్జునరావు, ఏఈఓ ఎర్రమల్ల మధు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, సిబ్బంది నాగమల్లయ్య దాతలు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-07T05:56:28+05:30 IST