వైసీపీ నేతల్లో నిరుత్సాహం
ABN, First Publish Date - 2022-05-29T06:12:44+05:30
వైసీపీ నేతల్లో నిరుత్సాహం
బొమ్ములూరు వద్ద ఆగకుండా వెళ్లిపోయిన బస్సు
హనుమాన్జంక్షన్ రూరల్, మే 28 : సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర శనివారం బొమ్ములూరు వద్ద కృష్ణాజిల్లాలోకి ప్రవేశించింది. నిర్వాహకులు చెప్పిన సమయానికి రెండు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటలకు బొమ్ములూరు చేరుకుంది. మంత్రి వర్గానికి స్వాగతం పలి కేందుకు ఎంపీడీవో ప్రసాద్తో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు కొమరవల్లి గంగాభవాని, బొమ్ములూరు, దంటగుంట్ల, బాపుల పాడు గ్రామాల సర్పంచ్లు కాటూరి విజయభాస్కర్, యజ్జ వరపు రంగారావు, సరిపల్లి కమాలకిరణ్, మరీదు రాంబాబుతో పాటు కార్యకర్తలు ఎండలోనే గంటల తరబడి వేచిచూశారు. ముందుభాగంలో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రమే నాయకులు అందించిన పుష్పగుచ్ఛాలను అందుకుని గన్నవరం జరిగే సభకు ఆలస్యమవుతోందని వెళ్లిపోయారు. మండుటెండలో వేచి చూసిన కార్యకర్తలు మంత్రులు కిందకు దిగకపోవడంతో నిరుత్సాహపడ్డారు.
Updated Date - 2022-05-29T06:12:44+05:30 IST