వీఆర్వోలపై పనిభారం, ఒత్తిడి తగ్గించాలి
ABN, First Publish Date - 2022-12-13T01:31:18+05:30
రెవెన్యూ విభాగంలో పనిచేసే వీఆర్వోలపై పనిభారం, ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రామరెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వీఆర్వోలు సోమవారం స్ధానిక తహసీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఉంగుటూరు, డిసెంబరు 12 : రెవెన్యూ విభాగంలో పనిచేసే వీఆర్వోలపై పనిభారం, ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రామరెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వీఆర్వోలు సోమవారం స్ధానిక తహసీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వీఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జోసఫ్ తంబి, ఎస్. శ్రీనివాసరతన్ మాట్లాడుతూ, రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు ఆదేశాల మేరకు వీఆర్వోలపై పెరిగిన పనుల ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోల సంఘం నాయకులు ఎ.సునీల్కుమార్, నళినీకుమార్, రామారావు, వినోద్కుమార్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-13T01:31:20+05:30 IST