ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: పన్నులు, విద్యుత్ భారాలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్నారు: Srinivasarao

ABN, First Publish Date - 2022-07-01T17:44:47+05:30

పన్నులు, విద్యుత్ భారాలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్నారని సీపీఎం నేత శ్రీనివాసరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): పన్నులు, విద్యుత్ భారాలతో ఏపీ (AP) ప్రజలు అల్లాడుతున్నారని, ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ (RTC) బస్సు ఛార్జీలు పెంచారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు (Srinivasarao) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డీజిల్ ధరలు తగ్గినా.. మళ్లీ సెస్ ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. ఏపీ ప్రభుత్వ అస్థవ్యస్త పాలనకు ఈ ధరాభారాలే నిదర్శనమన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అన్ని రకాలుగా జీఎస్టీ పేరుతో దోపిడీ చేస్తోందని ఆరోపించారు. నెల రోజుల పాటు ఇంటింటికీ సిపిఎం పేరుతో యాత్ర చేశామని, ఎక్కడకి వెళ్లినా ప్రజలు జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఇళ్ల‌ నిర్మాణ భారాలు మోపారని, ఎవరైనా ప్రశ్నిస్తే..‌వాలంటీర్ల ద్వారా పధకాలు అపేస్తామని బెదిరిస్తున్నారని చెబుతున్నారన్నారు. 


ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పోరాటం చేస్తుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జులై 11వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. ఆందోళనలో‌  పాల్గొనాలని పిలుపిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గతంలో రెండు సార్లు మంత్రిగా చేశారని, ఆదివాసీలపై పోలీసులు కాల్పులు జరిపితే కనీసం ఆమె ఖండించ లేదని విమర్శించారు. సొంత గ్రామానికి విద్యుత్ కూడా ఇప్పించలేక పోయారని ఎద్దేవా చేశారు. ఇటువంటి వారు రాష్ట్రపతిగా ఏం‌ పని చేస్తారని ఆయన ప్రశ్నించారు.


సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బీజేపీకి మద్దతు ఇస్తారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఏ హామీలు లభించాయో ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జులై 4న భీమవరం వస్తున్న ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీని బలపరుస్తున్న సీఎం, వైసీపీ  ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం జగన్.. రాష్ట్ర ప్రయోజనాలపై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. టీడీపీ కూడా మౌనం వీడి.. బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని, మహారాష్ట్ర ఉదంతం చూసైనా.. ఏపీలో వైసీపీ, టీడీపీ మేల్కొవాలని శ్రీనివాసరావు అన్నారు.

Updated Date - 2022-07-01T17:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising