బెజవాడలో YCP నేతల అరాచకాలు
ABN, First Publish Date - 2022-06-06T18:13:18+05:30
Vijayawada: బెజవాడలో వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి.
Vijayawada: బెజవాడలో వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఏపీ టూరిజం సిబ్బందిపై వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి (Chaitanya Reddy) భర్త ప్రసాద్ రెడ్డి (Prasad Reddy) దాడికి పాల్పడ్డారు. ఫోటో షూట్ అడ్డుకున్నందుకు టూరిజం సిబ్బందిపై దాడి చేశారు. ప్రసాద్ రెడ్డి తీరుపై టూరిజం సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు. అయితే కేసు నమోదు చేయకుండా పోలీసులపై కార్పొరేటర్ ఒత్తిడి తీసుకువచ్చారు. చైతన్య రెడ్డికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వత్తాసు పలకడం గమనార్హం.
Updated Date - 2022-06-06T18:13:18+05:30 IST