Krishna: ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం
ABN, First Publish Date - 2022-03-05T14:50:55+05:30
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.
విజయవాడ: కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. కాగా అలారం మోగడంతో దుండగులు పరారయ్యాయి. దుండగుల దాడిలో ఏటీఎం మిషన్ ధ్వంసమైంది. అయితే నగదు పోకపోవడంతో బ్యాంక్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-03-05T14:50:55+05:30 IST