కొడాలి నాని సంఘ విద్రోహ శక్తి: వర్ల రామయ్య
ABN, First Publish Date - 2022-01-23T17:05:19+05:30
విజయవాడ: గుడివాడ కేసినో ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
విజయవాడ: గుడివాడ కేసినో ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గుడివాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులపై దాడి ఘటనలను కృష్ణాజిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దాడిపై ఫిర్యాదు చేయాలని భావిస్తే తాను విజయవాడలో లేనంటూ డీజీపీ అబద్దాలు చెప్పారని వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని అంటేనే ఒక అసాంఘిక శక్తి అని, సంఘ విద్రోహ శక్తి అని అన్నారు. గుడివాడ వెళుతున్నామని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరామన్నారు. అయితే తమకు రక్షణ ఇవ్వకపోగా.. గుడివాడలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా పోలీసులు నడిపించిన తీరు చాలా బాధాకరమని అన్నారు. డీఐజీ కూడా అందుబాటులో లేనంటూ తప్పించుకున్నారని, అయితే ఆయన గుడివాడలో ప్రెస్ మీట్ పెట్టారని.. ఇలాంటి అబద్దాల డీఐజీని ఎప్పుడూ చూడలేదని వర్ల రామయ్య అన్నారు.
Updated Date - 2022-01-23T17:05:19+05:30 IST