ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసినోపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2022-01-27T18:24:52+05:30

గుడివాడలో కేసినో, జూదం గురించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశామని వర్ల రామయ్య తెలిపారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: గుడివాడలో కేసినో జూదం గురించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. గురువారం టీడీపీ బృందం గవర్నర్‌ను కలిసింది. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ కేసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్‌కు సమర్పించామన్నారు. గుడివాడ కేసినో గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసునని అన్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డి అయితే అసలు పట్టించుకోవడమే లేదని, దుర్మార్గపు మంత్రిని కాపాడాలన్నదే సీఎం ఆలోచనని అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని తీసేశారని వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-27T18:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising