ఎట్టకేలకు బదిలీలు!
ABN, First Publish Date - 2022-07-02T05:55:18+05:30
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తహసీల్దార్ల, ఎంపీడీవోల బదిలీల జబితాను కలెక్టర్ రంజిత్బాషా శుక్రవారం విడుదల చేశారు.
34 మంది తహసీల్దార్లు, 19 మంది ఎంపీడీవోలకు స్థానచలనం
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఉమ్మడి కృష్ణా జిల్లాలో తహసీల్దార్ల, ఎంపీడీవోల బదిలీల జబితాను కలెక్టర్ రంజిత్బాషా శుక్రవారం విడుదల చేశారు. గురువారమే ఈ బదిలీల ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యంగా విడుదల చేశారు. ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు అధిక శాతం బదిలీలు జరిగినట్లు రెవెన్యూ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 34 మంది తహసీల్దార్లు, 19 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు.
Updated Date - 2022-07-02T05:55:18+05:30 IST