AP News: వంగలపూడి అనితకు వైసీపీ నేతల బెదిరింపులు
ABN, First Publish Date - 2022-08-09T18:44:39+05:30
వంగలపూడి అనిత (Vangalapudi Anita)కు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయి.
విజయవాడ (Vijayawada): తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita)కు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం విజయవాడలో ఏపీ మహిళ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం (Round table meeting)లో ఆమె పాల్గొన్నారు. భేటీ జరుగుతుండగా అనితకు వైసీపీ నేత (YCP Leader) నుంచి ఫోన్ వచ్చింది. ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) వ్యవహారంపై అతిగా స్పందించవద్దంటూ హెచ్చరించాడు. అయితే తాను వాస్తవాలను మాత్రమే ప్రజలకు చెబుతున్నానని అనిత సమాధానం ఇచ్చారు. మాధవ్ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం లేదని వైసీపీ నేత అన్నాడు. కాగా అనిత ఫోన్ కాల్ను స్పీకర్ ఆన్చేసి సమావేశంలో అందరికి వినిపించారు. 9848075369 నెంబర్ నుంచి వైసీపీ నేత ఫోన్ చేసి బెదిరించాడని అనిత తెలిపారు.
Updated Date - 2022-08-09T18:44:39+05:30 IST