ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పశ్చిమ’కు వెలంపల్లి చేసింది శూన్యం

ABN, First Publish Date - 2022-09-11T06:12:42+05:30

‘పశ్చిమ’కు వెలంపల్లి చేసింది శూన్యం

మాట్లాడుతున్న సాదరబోయిన ఏడుకొండలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, సెప్టెంబరు 10: పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస రావు చేసిన అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాదర బోయిన ఏడుకొండలు విమర్శించారు. బుద్దా వెంకన్న కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారన్నారు. టీడీ పీ హయాంలో 90 శాతం నిర్మాణాలు పూర్తయిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. మంత్రిగా, ఎమ్యెల్యేగా వెలంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఏమీ చేయలేదని, ప్లై ఓవర్ల నిర్మాణం టీడీపీ హయాంలోనే జరిగిందని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో ఇసుక, గనుల దోపిడీలు విచ్చలవిడిగా జరుగుతోందని, ప్రజలు పాలకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గణపా రాము, ఈగల సాంబశివరావు, రాజగిరి అశోక్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-09-11T06:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising