ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌భవన్‌ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-12-30T00:48:32+05:30

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలో ని రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజతోపాటు పలువురు హనుమాన్‌ పేటలోని దాసరి భవన్‌ నుంచి గురువారం ర్యాలీ చేపట్టారు.

రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన కమ్యూనిస్టు నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలో ని రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజతోపాటు పలువురు హనుమాన్‌ పేటలోని దాసరి భవన్‌ నుంచి గురువారం ర్యాలీ చేపట్టారు. వారు దాసరి భవన్‌ నుంచి బయటకు రాగానే కొంతదూరంలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి వాహనాల్లో గవర్నరుపేట పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మోదీ అధికారంలోకి వ చ్చాక రాష్ట్రాల హక్కులను గౌరవించడం లేదన్నారు. గవర్నర్లను ఉపయోగించుకుని ప్రభుత్వాలను కూలగొట్టడమే పని గా పెట్టుకున్నారన్నారు. మెజారిటీ లేని రాష్ట్రాల్లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకొస్తున్నారన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఇలా ప్రభుత్వాలను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో గవర్నర్‌ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేసి, ఫెడరలిజాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తమ ఉద్యమానికి ప్రజాస్వామ్యవాదులు ముందుకొచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-12-30T00:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising