ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2022-07-03T06:41:05+05:30

పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ఽనిరసన కార్యక్రమం నిర్వహించారు.

తిరువూరులో వామపక్ష నాయకుల ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వామపక్షాల ఆందోళన

తిరువూరు, జూలై 2: పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ఽనిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఆర్‌ టవర్స్‌ సెంటర్‌లో జరిగిన ఆందోళనలో  నాయకులు ఎస్‌.వి.భద్రం, షేక్‌ సుభాని మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలపై వివిధ రకాల ఆర్థిక భారాలు మోపుతున్న ప్రభుత్వం, ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యులపై మరింత భారం మోపుతుందని విమర్శించారు. సామాన్యులు పల్లెవెలుగు బస్సులు సైతం ఎక్కలేని విధంగా ప్రభుత్వం చార్జీల మోతమోగిస్తుందన్నారు. తక్షణం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో సీపీఎం, సీపీఐ నాయకులు గుళ్లపల్లి  వెంకటరత్నం, ఆకుల రవి, జెట్టి శ్రీనివాసరావు, రామకృష్ణ, ఆంజనేయులు, ఉదయ్‌, ఆశోక్‌, మస్తాన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T06:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising