ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-07T05:53:46+05:30

కొడాలి గ్రామంలోని ఘంటసాల మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు బుధవారం ప్రారంభించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘంటసాల, జూలై 6 : కొడాలి గ్రామంలోని ఘంటసాల మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు బుధవారం ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే పసుపు కొనుగోళ్లు చేపడుతుందన్నారు. మార్కెఫెడ్‌ డీఎం కె.నాగమల్లిక మాట్లాడుతూ ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్ల పసుపు సేకరిస్తామని, ఒక క్వింటా పసుపుకు కనీస మద్దతు ధర రూ.6850లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జడ్పీటీసీ సభ్యుడు తుమ్మల మురళీకృష్ణ, వైసీపీ మండల కన్వీనర్‌ వేమూరి వెంకట్రావ్‌, డీసీఎంఎస్‌ బి.ఎం.ప్రసాదరావు, వైస్‌ ఎంపీపీ కుంపటి నాగేంద్రబాబు, కొత్తపల్లి, కొడాలి పీఏసీఎస్‌ చైౖర్మన్లు తాతినేని వెంకట కృష్ణారావు, రామకృష్ణ, సర్పంచ్‌లు వెంకటేశ్వరరావు, రామారావు,  దోనె వెంకటేశ్వరరావు, రమేష్‌  పాల్గొన్నారు.   

Updated Date - 2022-07-07T05:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising