ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమష్టి కృషితోనే అభివృద్ధి: ఎమ్మెల్యే వంశీ

ABN, First Publish Date - 2022-05-28T06:33:50+05:30

సమష్టి కృషితోనే అభివృద్ధి: ఎమ్మెల్యే వంశీ

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, మే 27: సమష్టి కృషితోనే మండల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అనగాని రవి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వైస్‌ ఎంపీపీ-1 కొమ్మరాజు సుధీర్‌, వైస్‌ ఎంపీపీ-2 సాతులూరి శివనాగరాజకుమారి, జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజిబెత్‌ రాణి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ గౌసాని, ఎంపీడీవో వై.సుభాషిణి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు  పాల్గొన్నారు. 

రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

  ఉంగుటూరుకు చెందిన ఎనిమిది మంది మొక్కు తీర్చుకునేందుకు మినీ వ్యాన్‌లో వెళ్తూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద  జాతీయ రహదారిపై జరిగిన ప్రమా ద బాధితులకు రూ. లక్ష సాయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అందజేశారు. వ్యక్తిగత కార్యదర్శి సతీష్‌, కార్యాలయ సమన్వయ కర్త వెంకటేశ్వరరావు, ఉంగుటూరు సర్పంచ్‌ వరప్రసాద్‌లను ప్రమాదస్థలానికి పంపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని సూచించారు. 

Updated Date - 2022-05-28T06:33:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising