రోడ్లు వేయరు.. డ్రెయిన్లు కట్టరు..
ABN, First Publish Date - 2022-05-28T06:36:06+05:30
రోడ్లు వేయరు.. డ్రెయిన్లు కట్టరు..
శాయిపురంలో గడపగడపకూ సమస్యల వెల్లువ
ఉయ్యూరు, మే 27 : రోడ్లు వేయరు.. డ్రెయిన్లు కట్టరు.. జగనన్న ఆసరాలేదంటూ శాయిపురంలో మహిళలు గడపగడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో వైసీపీ నాయకులను నిలదీశారు. ఎంపీ వల్లభ నేని బాలశౌరితో కలసి ఎమ్మెల్యే కేపీ సారథి శాయిపురంలో శుక్రవారం గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. జగనన్న ఆసరా రాలేదని తూమాటి రాజకుమారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి వచ్చే రోడ్డు అధ్వానంగా ఉందని, గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు లేక వర్షాకాలం బురదలో ఇబ్బందిపడుతున్నామని పలువురు గ్రామస్థులు ఎంపీ, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీలి కల్పన, బోళ్లపాడు ఎంపీటీసీ సభ్యురాలు గంగారత్నం, వైసీపీ మండల అఽధ్యక్షుడు దాసే రవి పాల్గొన్నారు.
Updated Date - 2022-05-28T06:36:06+05:30 IST