రమణీయం.. నారసింహుని కల్యాణం
ABN, First Publish Date - 2022-05-16T06:47:18+05:30
రమణీయం.. నారసింహుని కల్యాణం
ఉంగుటూరు, మే 15 : మండల పరిధిలోని లంకపల్లి అగ్రహారంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు గడ్డం వీరాస్వామి, అన్నం నాగేశ్వరరావు నేతృత్వంలో కుమ్మమూరు గ్రామానికి చెందిన ఆగమ వేదపండితులు పరాశరం రామకృష్ణమాచార్య పాకయాజి, శిష్యబృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి కల్యాణ క్రతువు కన్నులపండువగా జరిగింది. ఈసందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదికపై లక్ష్మీనరసింహస్వామి, ఉత్సవవిగ్రహాలను ప్రతిష్టింపజేసి, శాస్త్రోక్తంగా అందరూ తిలకించేవిధంగా ఆరుబయట వివాహం జరిపించారు. అర్చకస్వాములు చదలవాడ కుమారస్వామి, చదలవాడ నాగేశ్వరరావు, నాగలింగం ప్రసాద్శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - 2022-05-16T06:47:18+05:30 IST