ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఇద్దరూ ఒక్కటే: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-04-13T18:29:22+05:30

గ్యాస్, పెట్రోల్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుని నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆందోళన చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: గ్యాస్, పెట్రోల్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుని నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఎదుట ధర్నాకు దిగింది. ఇందులో భాగంగా విజయవాడలో పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాంతర్లు, విసనకర్రలు, కట్టె పుల్లలు పట్టుకుని వినూత్న నిరసన చేపట్టినట్లు చెప్పారు. విద్యుత్ కోతలపై వీధి ప్రదర్శన ద్వారా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.


బీజేపీ, వైసీపీ పార్టీలు వేరైనా...‌ మోదీ, జగన్‌లు మాత్రం ఒక్కటేనని రామకృష్ణ అన్నారు. ఇద్దరూ పోటీ పడుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని  మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ధర్నాలు చేసిన మోదీ... ఇప్పుడు గ్యాస్‌ను‌ వెయ్యికి పెంచారని విమర్శించారు. రూ.60 ఉన్న లీటర్ పెట్రోల్ ధర రూ. 120కి పెంచారని, 14సార్లు ధరలు పెంచి... ‌ప్రజలు వాహనం అంటే భయపడే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జగన్.. మోదీని మించి పన్నులు వసూళ్లు చేస్తున్నారని, జగన్ నిర్వాకం వల్లే… ఈ పరిస్థితి వచ్చిందని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2022-04-13T18:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising