ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీఆర్ బాండ్లరూపంలో వైసీపీ ఎమ్మెల్యే భారీ అవినీతి: పట్టాభి

ABN, First Publish Date - 2022-03-13T19:50:25+05:30

వైసీపీ అక్రమాలకు హద్దే లేకుండా పోయిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ అక్రమాలకు హద్దే లేకుండా పోయిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల రూపంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బినామీల పేరుతో భూములు కొనిపించి.. వాటిని అభివృద్ధి పేరుతో.. ఎమ్మెల్యే నాగేశ్వరరావు తణుకు మున్సిపాలిటీకి అంటగట్టారన్నారు. దీనికోసం తన బినామీలకు టీడీఆర్ బాండ్లు ఇప్పించారని, ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పట్టాభి విమర్శించారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే టీడీఆర్ బాండ్ల అవినీతిపై.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-13T19:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising