Jagan reddy చేసింది సామాజిక న్యాయం కాదు.. సామాజిక ద్రోహం: Anuradha
ABN, First Publish Date - 2022-06-23T17:05:41+05:30
పచ్చి అబద్దాల కోరుగా జగన్ రెడ్డిని గిన్నిస్ బుక్లో రికార్డు నమోదు చేయాలని అనురాధ అన్నారు.
Vijayawada: దేశంలోని రాజకీయ నాయకుల్లో పచ్చి అబద్దాల కోరుగా సీఎం జగన్ రెడ్డి (Jagan reddy)ని గిన్నిస్ బుక్లో రికార్డు నమోదు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ (Panchumarti Anuradha) అన్నారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం చేసి బీసీలను తానే ఉద్దరించినట్టు సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నారని, జగన్ చేసింది సామాజిక న్యాయం కాదని, సామాజిక ద్రోహమని విమర్శించారు.పల్నాడులో 12 మంది బడుగు, బలహీన వర్గాలు హత్య గావించబడితే నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారు?.. సామాజిక న్యాయం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. జాలయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న లోకేశ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించటం దుర్మార్గమన్నారు. పేరుకే బీసీలకు మంత్రి పదవులు.. పెత్తనమంతా సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలదేనని అనురాధ విమర్శించారు.
Updated Date - 2022-06-23T17:05:41+05:30 IST