నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
ABN, First Publish Date - 2022-01-29T06:44:40+05:30
నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
పెనమలూరు, జనవరి 28 : మండలంలో పండ్లు, కూరగాయలు, పూలు తదితర నర్సరీలు నిర్వహించే వారు 2010 నర్సరీ చట్ట ప్రకారం తప్పని సరిగా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని కంకిపాడు ఉద్యాన శాఖాధికారి జి. లక్పతి అన్నారు.
ఈ మేరకు శుక్రవారం గంగూరు, గోసాల గ్రామాల్లో ఉన్న కొన్ని నర్సరీలకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా లక్పతి మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన మొక్కలను అందిం చేందుకు ఏపీ ఉద్యాన నర్సరీల చట్ట నిబంధనలకు లోబడి లైసెన్సులను జారీ చేస్తునట్లు తెలిపారు. లైసెన్సు పొందడానికి నర్సరీ స్థల పత్రాలు, ఆధార్కార్డు, ఫారమ్ - ఏ, దరఖాస్తుతో పాటు రూ. వెయ్యి చలానా చెల్లించి రిజిస్ర్టేషన్ చేయించుకోవాలన్నారు. లైసెన్సు లేకుండా నర్సరీలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లక్పతి హెచ్చరించారు.
Updated Date - 2022-01-29T06:44:40+05:30 IST