ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన: ముద్దరబోయిన

ABN, First Publish Date - 2022-01-22T06:47:29+05:30

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన: ముద్దరబోయిన

మాట్లాడుతున్న ముద్దరబోయిన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముసునూరు, జనవరి 21: వైసీపీ అప్రజాస్వామిక పాలనలో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముద్దర బోయిన వెంకటేశ్వరావు విమర్శించారు. శుక్రవారం సూరేపల్లిలో నిర్వహించిన గౌరవసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా రౌడీయిజంతో భయపెడుతున్నారని ముద్దరబోయిన మండిపడ్డారు. పీఆర్సీ కోసం న్యాయపోరాటం చేస్తున్న ఉద్యోగులపై కేసులు పెట్టి, కొట్టించిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందని, మాయమాటలతో ఉద్యోగులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రబుద్ధుడు జగన్‌ అని, త్వరలోనే ప్రజలందరూ బుద్ది చెబుతారని హెచ్చరించారు. దేవినేని ఢాలారాం, కందుల పిచ్చియ్య, చళ్లగోళ్ల నాగమల్లేశ్వరావు, శోభనాద్రి పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T06:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising