గోరంట్ల మాధవ్ను బర్తరఫ్ చేయాలి
ABN, First Publish Date - 2022-08-07T06:27:11+05:30
గోరంట్ల మాధవ్ను బర్తరఫ్ చేయాలి
గన్నవరం, ఆగస్టు 6 : ఎంపీ గోరంట్ల మాధవ్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని టీడీపీ నాయకులు డిమాం డ్ చేశారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి ప్రదర్శన చేసి గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వ రావు, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు మేడేపల్లి రమ మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గు పడేలా ఎంపీ తీరు ఉందన్నారు. టీడీపీ నాయకులు బోడపాటి రవికుమార్, కొసరాజు సాయి, మండవ అన్వేష్, నిమ్మకూరి మధు, షేక్ అబుల్యాజ్, చిక్కవరపు నాగమణి, బొమ్మసాని అరుణ, పొదిలి లలిత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-07T06:27:11+05:30 IST