మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN, First Publish Date - 2022-01-29T06:46:00+05:30
మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
హనుమాన్జంక్షన్, జనవరి 28 : సమాజంలో జరుగుతున్న మోసాల పట్ల విద్యా ర్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కె.ఉషా రాణి అన్నారు. శుక్రవారం బాపుల పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘పాఠశాల భద్రత- విద్యార్థి భద్రత’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రఽధానోపాధ్యాయులు టీవీ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సై ఉషా రాణి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మోసాలు, నేరాలు, సైబర్ క్రైంలపై అవ గాహన కల్పిం చారు. అప్రమత్తంగా మెలగాలని విద్యార్థులకు సూచిం చారు. తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టకుండా నడుచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలకు బాపులపాడు మాజీ ఉప సర్పంచ్ కాకాని వెంకటేశ్వరరావు 25 లీటర్లు శానిటైజర్ అందజేశారు. ఈ సందర్భంగా బాపులపాడు పీహెచ్సీ వైద్య సిబ్బంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
Updated Date - 2022-01-29T06:46:00+05:30 IST