తరగతుల విలీనాన్ని ఆపాలి: ఎస్ఎఫ్ఐ
ABN, First Publish Date - 2022-08-01T18:23:05+05:30
Vijayawada: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలంటూ ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు కలెక్టరేట్ (Collectorate) ముట్టడికి
Vijayawada: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలంటూ ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు కలెక్టరేట్ (Collectorate) ముట్టడికి బయల్దేరారు. జీవో నెంబర్ 77 ను రద్దు చేయకపోతే రేపు (మంగళవారం) సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్వర రావు (Someswara Rao) డిమాండ్ చేశారు. ముట్టడి నేపథ్యంలో ధర్నాచౌక్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Updated Date - 2022-08-01T18:23:05+05:30 IST