ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుస్తక పఠనంతో విజ్ఞాన సముపార్జన

ABN, First Publish Date - 2022-01-19T06:45:26+05:30

పుస్తక పఠనంతో విజ్ఞాన సముపార్జన

చిత్తరంజన్‌ శాఖా గ్రంథాలయంలో తనిఖీలు చేస్తున్న టీజే పూర్ణమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్‌పర్సన్‌ టీజే పూర్ణమ్మ

సత్యనారాయణపురం, జనవరి 18: పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని, విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి చదుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్‌పర్సన్‌ టి. జె.పూర్ణమ్మ అన్నారు. సత్యనారాయణపురంలోని చిత్తరంజన్‌ శాఖా గంథ్రాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. గ్రంథాలయంలో సదుపాయాలపై పాఠకులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ భవనానికి  మరమ్మతులు చేయిస్తానని, ఫర్నిచర్‌, వసతులను సమకూరుస్తానని తెలిపారు. గ్రంథాలయంలో విజ్ఙాన గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.నాగరాజు, చిత్తరంజన్‌ గ్రంథాలయ శాఖాధికారి సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-19T06:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising