ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కృష్ణా జిల్లా: పెడనలో ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2022-08-22T21:15:53+05:30

పెడనలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన నాయకుల ఆందోళనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా (Krishna Dist.): పెడనలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన (Janasena) నాయకుల ఆందోళనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ (Ram Sudhir) ఆధ్వర్యంలో జనసైనికులు ఆందోళనకు దిగారు. జోగి రమేష్‌కు శవయాత్ర నిర్వహించి.. దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. మంత్రి జోగి రమేష్  డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా యడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ బీసీ ద్రోహి అని, కులాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. పెడన నియోజకవర్గ ప్రజలకు, పవన్ కళ్యాణ్‌కు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్‌కు సిగ్గుంటే ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. బూతులతో మంత్రి పదవి తెచ్చుకున్న జోగి రమేష్ సంస్కారహీనుడని, మంత్రిని వైసీపీ వాళ్లే తరిమికొట్టే రోజులు వస్తాయని రామ్ సుధీర్ అన్నారు.

Updated Date - 2022-08-22T21:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising