ఘనంగా డీవైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం
ABN, First Publish Date - 2022-11-02T00:20:21+05:30
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణలంక 21, 22 డివిజన్లలో మంగళవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఘనంగా డీవైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం
కృష్ణలంక, నవంబరు 1 : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణలంక 21, 22 డివిజన్లలో మంగళవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2 కోట్ల సభ్యత్వంతో దేశంలోనే అత్యంత పెద్ద యువజన సంఘంగా డీవైఎఫ్ఐ ఉందన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో సుమారు 9 లక్షల ఖాళీ పోస్టులు వున్నాయని, తక్షణమే వాటిని భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ పోరాడుతుందన్నారు. వేలాది మంది నిరుద్యోగులతో ఈ నెల 3న చలో ఢిల్లీ పిలుపునిచ్చామన్నారు. నిరుద్యోగులతో పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో వున్న యువత ఈ ర్యాలీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. డీవైఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల కృష్ణ, తూర్పు నగర అధ్యక్షుడు బత్తుల ఉమామహేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు కొండ, నాయకులు కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2022-11-02T00:20:26+05:30 IST