ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌.ముత్యాలంపాడు వంతెనకు మరమ్మతులు చేయాలి

ABN, First Publish Date - 2022-08-20T06:25:15+05:30

హెచ్‌.ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై దెబ్బతిన్న వంతెనకు తక్షణం మరమ్మతులు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జనసేన అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ) డిమాండ్‌ చేశారు.

వంతెనపై దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్ననాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన డిమాండ్‌ 

జి.కొండూరు, ఆగస్టు 19: హెచ్‌.ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై దెబ్బతిన్న వంతెనకు తక్షణం మరమ్మతులు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జనసేన అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ) డిమాండ్‌ చేశారు. జనసేన నాయకులతో కలిసి శుక్రవారం  వంతెనపై దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. వంతెనపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలకు అనేక ఇబ్బందులు  పడుతున్నారన్నారు. ముఖ్యంగా మండల కేంద్రం జి.కొండూరుకు వచ్చేందుకు అటు పలు గ్రామాల ప్రజలు, ఇటు వాహనాల రాకపోకలు లేక విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలకులు, అధికారులు  వంతెనకు మరమ్మతులు చేయించాలని, శాశ్వతంగా హైలెవల్‌ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని  కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వై.ఎల్‌ నరసింహారావు, ప్రవీణ్‌, నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T06:25:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising