ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి ఫైర్

ABN, First Publish Date - 2022-05-20T00:22:34+05:30

ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి ఫైర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్రలో రోడ్లపై వంశీ పసుపు నీళ్లు చల్లించారని శివభరత్ మండిపడ్డారు. జగన్‌పై గౌరవం ఉంటే రాజీనామా చేసి రావాలని సూచించారు. ఏ ముఖం పెట్టుకుని వంశీ గడపగడపకు తిరుగుతున్నాడని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని తిట్టినందుకు తిరుగుతున్నాడా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వంశీని కార్యకర్తలు ఛీ కొడుతున్నారని విమర్శించారు. వంశీ పక్కన ఉంటే మమ్మల్ని కూడా ఛీకొడతారని అన్నారు. వైసీపీ కార్యకర్తలను సస్పెండ్ చేయడానికి వంశీ అనుచరులు ఎవరు?, మీ అక్రమాలను నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ఆదేశిస్తే గన్నవరం నుంచి పోటీ చేస్తానని శివభరత్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2022-05-20T00:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising