కొండంతా.. సమస్యలే!
ABN, First Publish Date - 2022-06-30T05:36:49+05:30
నడిచేందుకు వీల్లేకుండా మెట్లు ఆధ్వానంగా ఉన్నాయి
ఇబ్బందులపై ఎమ్మెల్యే, మేయర్లను నిలదీసిన మహిళలు
చిట్టినగర్, జూన్ 29 : ‘నడిచేందుకు వీల్లేకుండా మెట్లు ఆధ్వానంగా ఉన్నాయి. డ్రైయినేజీ వ్యవస్థ పాడై మురుగునీటి కంపుతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం. మంచినీటి సమస్యతో నిత్యం నానా అవస్థలు పడుతున్నాం’ అని ఎమ్యెల్యే, మేయర్లను మహిళలు పెద్ద ఎత్తున నిలదీశారు. విద్యుత్ బిల్లుల షాక్తో ఇబ్బందులు పడుతున్నామని, పన్నుల భారాలు, నిత్యావసర ధరల పెంపు, గ్యాస్ పెట్రోలు, డీజిల్ మంటలతో జీవనోపాధి కుంటుపడిందని ప్రజలు తమ వద్దకు వచ్చిన పాలకులను కడిగేశారు. బుధవారం 51వ డివిజన్ ఆంజనేయవాగు కొండప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది.
Updated Date - 2022-06-30T05:36:49+05:30 IST