ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ షాక్‌తో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2022-12-14T00:59:10+05:30

ఓ చర్చిలో డెకరేషన్‌ చేస్తుండగా, ఇంజనీరింగ్‌ విద్యార్థి కరెంట్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. బందరు మండలం చిన్నాపురంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను బందరు రూరల్‌ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

సాయిప్రసాద్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 13 : ఓ చర్చిలో డెకరేషన్‌ చేస్తుండగా, ఇంజనీరింగ్‌ విద్యార్థి కరెంట్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. బందరు మండలం చిన్నాపురంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను బందరు రూరల్‌ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ధనేకుల ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫైనలియర్‌ చదువుతున్న చలమల శెట్టి సాయిప్రసాద్‌ (20) సెలవులు ఇవ్వడంతో స్వగ్రామమైన చిన్నాపురం వచ్చాడు. సెమీ క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా చర్చిని అలంకరిస్తుండగా, విద్యుత్‌ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినా ఫలితం దక్కలేదు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయిప్రసాద్‌ తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మృతిచెందడంతో కుటుంబంలో విషాదం అలముకుంది.

Updated Date - 2022-12-14T00:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising